నేడు మునుగోడుకు అమిత్ షా.. షెడ్యూల్‌లో మార్పు..

-

మునుగోడులో గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టిన కాషాయ దళం విజయఢంకా మోగించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షాతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అమిత్ షా మునుగోడు పర్యటన షెడ్యూల్ ఖారారైంది. ఇవాళ మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది బీజేపీ పార్టీ. ఈ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రానున్నారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్​లో బయలుదేరి సాయంత్రం నాలుగున్నర గంటలకు మునుగోడుకు చేరుకుంటారు. అనంతరం మునుగోడు లో దళిత కార్యకర్త ఇంట్లో భోజనం చేయనున్న అమిత్ షా… రైతులతో మాట్లాడనున్నారు.

అనంతరం సభలో పాల్గొననున్నారు అమిత్ షా. సభ ముగిశాక రామోజీ ఫిల్మ్ సిటీ కి వెళ్లనున్న షా… ఇవాళ రాత్రి novatel లో బిజెపి ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఇక ఇవాళ్టి సభలో రాజ్ గోపాల్ రెడ్డి జాయినింగ్ మాత్రమే ఉంటుందని… నియోజక వర్గానికి సంబంధం లేని నేతల చేరికలు ఇవాళ ఉండవని బిజెపి నేతలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news