గోరంట్ల మాధవ్‌ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం కీలక ఆదేశాలు

-

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఆయన ఫేస్ కట్ తో విడుదలైన ఓ వీడియో కారణంగా… మొన్నటి వరకు రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఈ వ్యవహారంపై మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. హిందూపురం వైఏస్సార్ సిపి ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరో తలనొప్పి వచ్చి పడింది.

ఇటీవల సంచలనం రేపిన వీడియో ఎపిసోడ్ పై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఏపీకి చెందిన పలువురు మహిళా నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిసి ఎంపీపై ఫిర్యాదు చేయగా, దీనిని సిఎస్ కు పంపింది. ఈ వీడియో వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఈ విషయాన్ని రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్న వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు చెన్నుపాటి కీర్తికి, రాష్ట్రపతి భవన్ ప్రజా సంబంధాల అధికారి కుమార్ సమ్రేష్ లేఖ ద్వారా తెలియజేశారు. మహిళా జేఏసీ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేశారని, ఆ కాపీని ఏపీసిఎస్ కు పంపి ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు లేఖలో ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Latest news