మోడీ..మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని – అసెంబ్లీలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

మోడీ..మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని అని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల తర్వాత ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంట్ కష్టాలు చూశామన్నారు. అందరం ఇబ్బంది పడ్డామని.. మోడీ ప్రభుత్వం మొదటి క్యాబినెట్ లోనే తెలంగాణ గొంతు నొక్కిందని ఫైర్ అయ్యారు.

మన మండలాలు..సీలేరు ప్రాజెక్టు గుంజుకుందని.. తెలంగాణ బిల్లు ఫైనల్ స్టేజ్ కి వచ్చే సరికి తెలంగాణకు కేటాయింపు లో సోనియా గాంధీ మనకు సీలేరు ఇచ్చారన్నారు. సింగరేణి కూడా మనకే కేటాయించిందని గుర్తు చేశారు. రఘునందన్ రావు…అసెంబ్లీలో సత్యదూరం మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. సభను తప్పుదోవ పట్టిస్తు న్నారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి కలారస్తుంది బీజేపీ అని.. అధికారం బాధ్యత..ఇది రాచరిక కాద న్నారు. పవర్..ఉమ్మడి జాబితా లోనిదని.. రాష్ట్రాలను అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news