జనసేన పార్టీలోకి వైసిపి కీలక నేత !

-

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నేత బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆదివారం బొంతు రాజేశ్వరరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజోలు నియోజకవర్గం నుంచి బొంతు రాజేశ్వర రావుకి జనసేన టికెట్ ఇచ్చేందుకు ఇప్పటికే చర్చలు పూర్తయినట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం వైసీపీలో ఉన్న బొంతు.. టికెట్ హామీతో జనసేనలోకి వచ్చేస్తారని అంటున్నారు. బొంతు రాజేశ్వరరావు 2014, 2019 ఎన్నికల్లో వైసిపి తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు బొంతు. బొంతు రాజేశ్వరరావు ఈ నెల 15వ తేదీన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news