అమరావతి టు అరసవిల్లి పాదయాత్ర కాదు.. టిడిపి శవయాత్ర – మంత్రి జోగి రమేష్

-

టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్. విజయవాడలో 40 గుళ్ళు కూలగొట్టిన సన్యాసి చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నేతృత్వంలో ఓ రథం తీసుకుని యాత్ర చేస్తారట!.. చవట, సన్నాసులు, దద్దమ్మలు టిడిపి నేతలు అని అన్నారు. జగన్ గురించి, ఆయన కుటుంబం గురించి ఈ ఒక్క మాట మాట్లాడినా తాటతీస్తాం, దవడ పగిలిపోద్ది అంటూ హెచ్చరించారు.

jogi ramesh

అది అమరావతి టు అరసవిల్లి పాదయాత్ర కాదని.. టిడిపి శవ యాత్ర అంటూ ఎద్దేవా చేశారు. సెలెక్ట్, ఎలక్ట్, కలెక్టెడ్ యాత్ర అని ఆరోపించారు. చంద్రబాబు పని అయిపోయిందని.. బుల్డోజర్లు, క్రేన్ లు పెట్టి లాగిన లేవ లేడని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సమానంగా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నామన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ఇలా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్న జగన్ నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు మద్దతు ఇచ్చారని తెలిపారు.

అందుకే ఏ ఎన్నికలు జరిగినా వైసీపీకే మద్దతుగా నిలబడ్డారని అన్నారు. అమరావతిని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడని ఆరోపించారు. ఇప్పటికీ అమరావతి పేరు చెప్పి చంద్రబాబు వసూళ్లకు పాల్పడుతున్నాడని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news