గవర్నర్ తమిళిసై బిజెపి నేతలా మాట్లాడుతున్నారు – మంత్రి తలసాని

-

ఆర్ఎస్ నేతలు అన్ని నియోజకవర్గాలలో తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలను నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులు విద్యార్థులు ఈ ర్యాలీలలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ర్యాలీని ప్రారంభించారు.

అమీర్ పేట లోని కనకదుర్గమ్మ దేవాలయం నుండి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. గవర్నర్ తమిళిసై బీజేపీ పార్టీ నేతలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం అని గవర్నర్ అనడం కరెక్ట్ కాదని అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news