3 యూనివర్సిటీల పేరు మార్పునకు సీఎం రేవంత్ శ్రీకారం

-

తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ లో మూడు యూనివర్సిటీల పేరు మార్పునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలుపడం కోటి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారు.


తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు ఫైనల్ చేశారు. టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుగా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అటు తెలంగాణ రాష్ట్ర రైతులకు.. న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సన్న బియ్యం బోనస్ పైన తాజాగా కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల నుంచి… క్వింటాల్ సన్న బియ్యం పైన 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం.

వాస్తవానికి ఎన్నికల కంటే ముందు.. క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు ప్రతి ఒక్కరు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం కోసమే డబ్బులు ఇస్తామని… మాట మార్చారు కాంగ్రెస్ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news