తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమలలోని 16 కంపార్టుమెంట్లలో భక్తులు..వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 73,104 మంది భక్తులు.. నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు.

Restrictions on Tirumala laddus

28,330 మంది భక్తులు..నిన్న ఒక్క రోజే తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు గా నమోదు ఐంది. ఇది ఇలా ఉండగా, టీటీడీ లడ్డూ తయారీ లో నెయ్యి అంశంపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమగ్ర వివరాలతో ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని TTD EOకి ఆదేశాలు జారీ చేశారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news