జైశ్రీరామ్ అని బిజెపి అంటే మనం జైజై శ్రీరామ్ అందాం – కల్వకుంట్ల కవిత

-

బిజెపి వాళ్లు జైశ్రీరామ్ అంటే మనం జై జై శ్రీరామ్ అనాలని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారం లో ఉన్నంత మాత్రాన ప్రజలకు దూరమయ్యే పార్టీ టిఆర్ఎస్ కాదని అన్నారు. అధికారం లో ఉన్నా, లేకున్నా టిఆర్ఎస్ ప్రజలతో నే ఉంటుందన్నారు. కొంతమంది ప్రజలను విడగొట్టి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మతం పేరు చెప్పి ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జై శ్రీరామ్ అని బిజెపి అంటే మనం జై జై అందామని.. కానీ అది విషయం కాదు మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నారు. ఉద్యోగాల నోటిఫిేషన్ల కోసం ఎంపి అరవింద్ ను నిలదీయండని పిలుపునిచ్చారు. ఈ 9 రోజులు ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుందామన్నారు కవిత.

Read more RELATED
Recommended to you

Latest news