గిరిజన పాఠశాలలో దారుణం.. బాలికను గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు

-

విద్యార్థుల భవిష్యత్ కు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు కామంతో దారితప్పాడు. అభం శుభం తెలియని బాలికపై కన్నేశాడు. తన కోరిక తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి పదో తరగతి విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని ఓ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగింది.

గత కొద్దిరోజుల నుంచి  బాలిక అనారోగ్య సమస్యలతో బాధ పడగా ఆమె తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. గర్భవతి అని నిర్ధారణ అయింది. తల్లిందండ్రులు కూతురును నిలదీయగా.. జరిగిన ఘోరాన్ని వారికి చెప్పింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు దమ్మపేట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వెంటనే ఉపాధ్యాయుడు పిచ్చయ్యను విధుల నుంచి తొలగించి శిక్షించాలని మహిళా సంఘాలు, గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news