బూర నర్సయ్య ప్రజలకు తెలియదు.. కెసిఆర్ బొమ్మ మీద ఎంపీగా గెలిచాడు – మంత్రి మల్లారెడ్డి

-

మాజి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారడంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. డాక్టర్ బూర నర్సయ్య ప్రజలకు తెలియదని.. కెసిఆర్ బొమ్మ మీద ఎంపీగా గెలిచాడని అన్నారు. బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారినంత మాత్రాన టిఆర్ఎస్ పార్టీకి నయా పైసా నష్టం లేదన్నారు.

 

రాజ గోపాల్ రెడ్డి తమ్ముడే నర్సయ్య గౌడ్ అని.. ఆయన ఎమ్మెల్యేగా ఉండి మూడు సంవత్సరాలు నియోజకవర్గంలోకి రాలేదని.. బూర నర్సయ్య ఎంపీ గా గెలిచి 5 సంవత్సరాలు నియోజక వర్గానికి రాలేదని ఎద్దేవా చేశారు. అందుకే ప్రజలు భూర నర్సయ్య గౌడ్ ను ఓడ గొట్టారని అన్నారు. భుర నర్సయ్య గౌడ్ ను ప్రజలు మర్చిపోయారని అన్నారు మంత్రి మల్లారెడ్డి.

ఈ ఉప ఎన్నిక ఎవరి కోసం వచ్చింది? అని ప్రశ్నించారు. మునుగోడు అభి వృద్ధి కోసం రాలే.. కేవలం రాజ గోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ ల కోసమే ఈ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఈ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్ కూడా రాదన్నారు. మూడేళ్ల నుండి చేయనిది ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలిచి ఏమి చేస్తావని రాజగోపాల్ రెడ్డి ని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news