పండగ పూట ఈవీ షోరూంలో అగ్నిప్రమాదం.. 25 బైకులు దగ్ధం

-

ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో దీపావళి పండగ పూట ప్రమాదం చోటుచేసుకుంది. పాలకొండ పట్టణంలోని ఓ బైక్‌ షోరూంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్‌ వాహనాలు (ఈవీ) విక్రయించే షోరూంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విక్రయానికి సిద్ధంగా ఉంచిన  25 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. షోరూం నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న మొత్తం 25 వాహనాలతోపాటు బ్యాటరీలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు షోరూం యజమానులు తెలిపారు. పండగ పూట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహాని కలగలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news