తారక్ ఆడియోకి బాలయ్య కన్ఫాం

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుక సెప్టెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఈ వేడుకకు గెస్ట్ గా రాం చరణ్ వస్తున్నాడని వార్తలు రాగా లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ ఆడియోకి నందమూరి బాలకృష్ణ వస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. హరికృష్ణ మరణంతో కొన్నాళ్లు దూరంగా ఉన్న బాబాయ్, అబ్బాయ్ ల మాటలు కలిశాయి.

ప్రస్తుతం ఇంటి పెద్దగా వారికి సపోర్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో బాలకృష్ణ కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో అరవింద సమేత ఆడియోకి వచ్చి ఆశీర్వదిస్తారని అంటున్నారు. చిత్రయూనిట్ క్లోజ్ సర్కిల్స్ నుండి వస్తున్న సమాచారం మేరకు అరవింద సమేత ఆడియోకి బాలకృష్ణను గెస్ట్ గా అడగడం ఆయన ఓకే చెప్పడం జరిగిందట.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఈషా రెబ్బ కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందట.

Read more RELATED
Recommended to you

Latest news