పూటకో పార్టీని మార్చే ఆర్.కృష్ణయ్యతో బీసీలను అణగదొక్కే ప్రయత్నం : బుద్దా వెంకన్న

-

ఎంపీ ఆర్‌.కృష్ణయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. పూటకు ఒక పార్టీని మార్చే ఆర్.కృష్ణయ్య లాంటి వాళ్లను అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో బీసీలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. కృష్ణయ్య మొదట టీడీపీలో ఉన్నాడని, తర్వాత కేసీఆర్ తో, అటు తర్వాత సొంత పార్టీ పెడుతున్నానని ప్రచారం చేసి ఇప్పుడు జగన్ తో ఉన్నారు… అందుకే ఇతనిని పూటకొక పార్టీ మార్చే వ్యక్తి అని అంటున్నాం అని వివరించారు బుద్ధా వెంకన్న. కృష్ణయ్యకు నయీం గ్యాంగుతో కూడా సంబంధాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని బీసీల ప్రతినిధి అనడం సిగ్గుచేటని అన్నారు.

No photo on flexi: Ex-MLC Buddha Venkanna abruptly leaves TDP meeting

ఆర్.కృష్ణయ్య బీసీలందరినీ జగన్ రెడ్డికి హోల్ సేల్ గా అమ్మేస్తున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తిని బీసీ ప్రతినిధి అని చెప్పుకోవడానికి బీసీలు అవమానంగా భావిస్తున్నారని బుద్ధా వెంకన్న తెలిపారు. “గత ముప్పై ఏళ్లుగా బీసీలను అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసిన వ్యక్తి కృష్ణయ్య. మూడున్నరేళ్లలో 24 మంది బీసీలను హత్య చేయించిన జగన్ రెడ్డిని బీసీ ఉద్దారకుడు అని చెప్పేందుకు కృష్ణయ్యకు ఏమాత్రం సిగ్గులేదు. జగన్ రెడ్డి కుటుంబ వైభవం బీసీల శవాలపై నిర్మించుకున్నది. జగన్ రెడ్డి తాత రాజారెడ్డి జింకా వెంకటనరసయ్య అనే బీసీ వ్యక్తిని హత్యచేసి మంగంపేటలో బైరటీస్ గనిని కబ్జా చేశాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీ జనగనణ చేయాల్సిందేనని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి
కేంద్రానికి పంపితే దాన్ని వదిలేసిన వ్యక్తి జగన్ రెడ్డి’ అని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news