గుంటూరులో ప్రేమోన్మాది ఘాతుకం.. వైద్యవిద్యార్థిని గొంతుకోసి హత్య, తానూ చేయి కోసుకుని..

-

 

గుంటూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. వైద్యవిద్యార్థిని గొంతుకోసి హత్య, తానూ చేయి కోసుకున్నాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే, విజయవాడకు చెందిన నిందితుడు జ్ఞానేశ్వర్ సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం వీరిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవల మనస్పర్ధలు రావడంతో తక్కెళ్ళపాడు లోని ఓ దంత వైద్య కళాశాలలో చదువుతున్న తపస్వి స్నేహితురాలు, వీరిద్దరి మధ్య రాజి కుదిరిచ్చేందుకు తన వద్దకు పిలిచింది. దీనితో వారం రోజులుగా తపస్వి తన స్నేహితురాలి వద్దే ఉంటుంది.

ఈ క్రమంలో ఆమెపై పగ పెంచుకున్న జ్ఞానేశ్వర్ హతమార్చాలని పథకం వేసుకున్నాడు. సోమవారం తపస్వి స్నేహితురాలు ప్రేమికులిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయగా ఆ సమయంలో అతడు కోపోద్రిక్తుడై తపస్విపై సర్జికల్ బ్లేడ్ తో గొంతు కోశాడు. పక్కనున్న స్నేహితురాలు కేకలు వేసి బయటకు వెళ్లడంతో స్థానికులు వచ్చారు. దీంతో జ్ఞానేశ్వర్ తలుపులు మూసేసి, కొన ఊపిరితో ఉన్న తపస్విని ఓ గది నుంచి మరో గదికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. స్థానికులు తలుపులు పగలగొట్టి ఆమెను 108 వాహనంలో తరలించారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news