ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద షర్మిల దీక్ష

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇటీవల వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించిన తర్వాత రాజకీయంగా పెద్ద చర్చ మొదలైంది. పాదయాత్రలకు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించింది.

కాగా పాదయాత్ర కోసం మరోసారి షర్మిల పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా పాదయాత్రకి అనుమతి తిరస్కరించారు పోలీసులు. షర్మిల పాదయాత్ర వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు పాదయాత్రకి అనుమతి నిరాకరించడంతో ఆమె హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి.. అక్కడే నిరసన దీక్ష చేపట్టారు. తన పాదయాత్రకు వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వైయస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news