40 గంటలుగా గుహలో రాజు ప్రాణం.. కాపాడేందుకు బ్లాస్టింగ్ !

-

కామారెడ్డి అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి, సింగరాయిపల్లి గుహలోపల బండరాళ్ల మధ్య చిక్కుకొని రాజు అనే వ్యక్తి నరకయాతన అనుభవిస్తున్నాడు. బయటకు కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. పక్కనున్న బండరాళ్ళను తొలగించి రాజును క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గుహ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది.

డ్రిల్లింగ్ మిషన్ల సహాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు. బాధితుడికి ఆక్సిజన్, ఫ్లూయిడ్స్ పంపిస్తున్నారు. అధికారులు రాజును బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కొబ్బరి నూనె సైతం వినియోగిస్తున్నారు. బండరాలను పేల్చివేస్తూ కాపాడేందుకు దాదాపు 50 మందికి పైగా సిబ్బంది రెస్క్యూ నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news