సిరిసిల్లలో కేటీఆర్​కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

-

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్​కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీల్లో పేర్కొన్న అంశాలు చూస్తుంటే వాటిని విద్యార్థులే కట్టారని అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యానర్లు, ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఎల్లారెడ్డిపేట మండలానికి డిగ్రీ కాలేజీ ఇస్తామని గతంలో కేటీఆర్ హామీ ఇచ్చారు. అయితే అది ఇప్పటివరకు నెరవేరలేదు. దీంతో కేటీఆర్​కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ కట్టారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్ బలపరిచిన అభ్యర్థిని, కేటీఆర్​ను ఓడిస్తామని ఫ్లెక్సీలో రాశారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయిందని, ఇంటర్ చదివిన విద్యార్థులు డిగ్రీకి వెళ్లొద్దా అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news