తెలుగు సినిమా కోసం కత్రినా కైఫ్ పారితోషకం ఎంతో తెలుసా..?

-

కత్రినా కైఫ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలుతోందని చెప్పాలి. వరుస సినిమాలతో మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె మొదట్లో తెలుగు సినిమాలలో కూడా నటించింది. విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన చిత్రం మల్లీశ్వరి. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో కత్రినా కైఫ్ , వెంకటేష్, సునీల్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా కామెడీని పండించాయి. మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్ కి కత్రినా కైఫ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే .అయితే అప్పటికి ఇంకా ఆమె బాలీవుడ్లో కేవలం ఒకే ఒక సినిమాలో నటించింది.

వెంటనే తెలుగులో అవకాశం రావడంతో వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా కోసం ఆమె ఎంత పారితోషకం తీసుకుందనేది ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి అవకాశం తోనే ఏకంగా 70 లక్షల రూపాయల పారితోషకం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి. అప్పట్లో ఇది చాలా అత్యధిక పారితోషకం. ఈ సినిమా తర్వాత మరొక సినిమాలో కూడా నటించింది. అల్లరి పిడుగు సినిమాలో బాలకృష్ణతో ఆడి పాడిన కత్రినా కైఫ్ ఆ సినిమా హిట్ కాకపోవడంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి మకాం మార్చింది.

అక్కడ టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి మళ్లీ తెలుగు సినిమాల జోలికి రాలేదు. ప్రస్తుతం రూ.6 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తెలుగులో నటించింది ఒకటి రెండు సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తన ప్రియుడిని కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ వివాహం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news