సమంతకు షాక్..ఏం మాయ చేశావెకి సీక్వెల్.. హీరోయిన్ గా రష్మిక !

-

సమంత – అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన మొదటి చిత్రం ఏ మాయ చేసావే. ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాదు ఈ సినిమాతోనే వీరిద్దరూ ప్రేమించుకొని ఆ తర్వాత వివాహం కూడా చేసుకున్నారు.

అయితే ఈ సినిమా విడుదలై 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మరికొన్ని సినిమాలలో నటించారు. అలా వచ్చిన ఆటోనగర్ సూర్య , మనం, మజిలీ వంటి సినిమాలు వీరి ప్రేమకు మరింత బలాన్ని అందించాయి. అయితే, ఏ మాయ చేసావే సినిమా సీక్వెల్‌ త్వరలోనే రానుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్‌. అయితే, ఇందులో సమంత స్థానంలో రష్మికను తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news