యాదాద్రి భక్తులకు అలర్ట్‌..నేడు ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు రద్దు

-

యాదాద్రి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్‌. యాదాద్రిలో ఇవాళ లక్ష్మీనరసింహా స్వామి వారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది మూర్ము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు.


ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం సుప్రభాతం నుంచి మధ్యాహ్నం ఆరగింపు వరకు నిర్వహించే ఆర్జిత సేవలు, ప్రత్యేక ధర్మదర్శనాలను రద్దు చేస్తున్నామని ఆలయ ఈవో గీత చెప్పారు. అదేవిధంగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు బ్రేక్ దర్శనాలను కూడా క్యాన్సల్ చేస్తున్నామని వెల్లడించారు. నిత్యకైంకర్యాలను అంతరంగీకంగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ఇప్పటివరకు యాదాద్రిశ్వరుడిని నలుగురు రాష్ట్ర ప్రతులు మాత్రమే దర్శించుకోవడం విశేషం.

 

Read more RELATED
Recommended to you

Latest news