జగన్‌ సీరియస్‌ కావడంపై ఆనం రామనారాయణ హాట్‌ కామెంట్స్‌

-

నిన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగన్‌ సీరియస్‌ అయ్యారు. అయితే, జగన్‌ స్పందిండంపై ఆనం రామనారాయణ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇంచార్జ్ ని మారుస్తున్నారనే సమాచారం నాకు ఇవ్వలేదని.. త్వరగా పనులు చేయండి, మనకి సమయం లేదు అని మాత్రమే చెప్పానని వెల్లడించారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.

ముందస్తు ఎన్నికలు వస్తే ఇంటికెళ్లడం కాయం అనడం ఎవరినీ ఉద్దేశించి కాదని పేర్కొన్నారు. ముందస్తు అని వింటున్నాం, అది జరిగితే ఫండ్స్ ఫ్రీజ్ అవుతాయి అనే అన్నానని చెప్పారు. వేచి చూద్దాం ఏమి జరుగుతుందో…? తర్వాత మాట్లాడుదామన్నారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నా మాటలను అవగాహన చేసుకునే వారితో మాట్లాడవచ్చు…. అంతే కానీ మరేమీ మాట్లాడలేదని.. ఇంచార్జ్ గా నేదురుమల్లిని నియమించాక మాట్లాడుతానని స్పష్టం చేశారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news