హైదరాబాద్​ డ్రగ్స్ కేసు.. మోహిత్‌ను ఒకరోజు కస్టడీకి ఇచ్చిన నాంపల్లి కోర్టు

-

డ్రగ్స్ కేసులో పట్టుబడిన మోహిత్​ను ఒక రోజు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. రాంగోపాల్ పేట్ పోలీసులు మోహిత్​ను ఇవాళ ఉదయం 10గంటలకు కస్టడీలోకి తీసుకొని.. సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్నారు. మోహిత్​కు దాదాపు 50 మంది ప్రముఖులతో పరిచయాలున్నట్లు నార్కోటిక్ విభాగం పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి సెల్​ఫోన్​లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్​ను సేకరించారు. మోహిత్​ను ప్రశ్నించడం ద్వారా వాళ్లతో అతనికి ఉన్న సంబంధాల గురించి తెలుసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

బాలీవుడ్ నటి నేహా దేశ్​పాండే భర్త అయిన మోహిత్ ఇంటర్నేషనల్ డీజే నిర్వాహకుడిగా కూడా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్​లోని పలు పబ్బులలో పార్టీలు ఏర్పాటు చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది నవంబర్​లో గోవా మాదక ద్రవ్యాల స్మగ్లర్​ ఎడ్విన్​​ను అరెస్ట్ చేసినప్పుడు మోహిత్ బండారం బయటపడింది. ఎడ్విన్ ద్వారా మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసిన మోహిత్ వాటిని పబ్బులలో సరఫరా చేసినట్లు నార్కోటిక్ విభాగం పోలీసులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news