తెలంగాణ బిజెపికి కొత్త అధ్యక్షుడు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు !

-

 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని మార్చుతారనే వ్యాఖ్యలపై విజయ శాంతి స్పందించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎదుర్కుంటున్న పరిణామాలపై సోషల్ మీడియాలో నా స్పందన చూసి, బీజేపీలోనూ రాష్ట్ర నాయకత్వ మార్పు అని అసంబద్ధ ఊహాగానాలు కొందరు బీజేపీ వ్యతిరేకులు లేవనెత్తుతున్నారని ఫైర్ అయ్యారు.

 

ఈ అంశంపై మా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ గారు, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిగారు సైతం స్పష్టతనిచ్చారు. తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు ఉండదని స్పష్టం చెయ్యడమే గాక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రస్తుత టీంతో , బండి సంజయ్ గారి నేతృత్వంలోనే యుద్ధానికి సిద్ధమని తేల్చి చెప్పారన్నారు.

 

అరకొర సమాచారాన్ని నమ్మి చిలవలు పలవలు చేసి ప్రచారం చేసేవారికి ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదు.రేపటి విజయం బీజేపీది, ఫలితం తెలంగాణ ప్రజలందరిదని…జై శ్రీరాం అంటూ వ్యాఖ్యానించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news