చిరు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకుండా శృతిహాసన్ ను బెదిరించారా..?

-

తాజాగా శృతిహాసన్ అటు బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో పాటు ఇటు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలలో కూడా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య అలాగే బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలో సంక్రాంతి బరిలో నువ్వా? నేనా? అంటూ పోటీ పడబోతున్నాయి. ఓ రకంగా చెప్పాలి అంటే సంక్రాంతి హీరోయిన్ ఈమె కావడం గమనార్హం. ఇకపోతే వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెరిసిన శృతిహాసన్.. వాల్తేరు వీరయ్య ఫంక్షన్ కి మాత్రం డుమ్మా కొట్టేసింది. ఒక సినిమా ఫంక్షన్ కి వచ్చి.. మరో ఫంక్షన్ కి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.

నిజానికీ శృతిహాసన్ కి కాస్త ఒంట్లో బాగోలేదట.. ఒంగోలు ఫంక్షన్ లో పాల్గొనడం వల్ల ఆమె పూర్తిగా అలసిపోయిందని.. జ్వరం కూడా వచ్చిందని.. కోవిడ్ టెస్ట్ చేయించుకుందని.. వాల్తేరు వీరయ్య వేదికపై చిరంజీవి శృతిహాసన్ తరపున వివరణ ఇచ్చారు. అంతేకాదు ..” ఒంగోలులో శృతి ఏమి తిన్నదో.. ఎవరు బెదిరించారో తెలియదు ..ఈ ఫంక్షన్ కి రాలేకపోయింది..” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు చిరంజీవి. అయితే శృతిహాసన్ ఈ చిత్రంలో చాలా అద్భుతమైన ప్రతిభ కనబరిచిందని.. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా డాన్సులు చేసింది అని.. తన పాత్ర ఈ సినిమాలో కీలకం కాబోతోందని.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇకపోతే వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 14వ తేదీన విడుదల కాబోతుండగా.. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలలో ఏ ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా సరే శృతిహాసన్ కు మంచి పేరు వస్తుంది. మరోవైపు ఈమె ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమాలో కూడా ఈమె నటిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news