నేటి నుంచి బీజేపీ పదాధికారులు, కార్యవర్గ సమావేశాలు

-

బీజేపీ రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పాలమూరు వేదికగా జరగనున్న ఈ సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. బండి సంజయ్ అధ్యక్షతన జరిగే సమావేశాలకు పార్టీ జాతీయ నేతలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. దిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానించిన అంశాలపై చర్చించనున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలాంటి వ్యూహాన్ని సిద్ధం చేయాలనే అంశంపైనా సమాలోచనలు చేయనున్నారు. ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన పోలింగ్ బూత్ సమ్మేళనాలు, పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనా చర్చించనున్నారు.

రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించిన అంశాలను… ఈ నెల 28, 30, 31 తేదీల్లో నిర్వహించనున్న జిల్లా కార్యవర్గ సమావేశాల్లో వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు మండల కార్యవర్గ సమావేశాల్లోనూ నేతలకు పలు అంశాలపై మార్గనిర్దేశనం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news