మరోసారి షాకింగ్ ట్వీట్ లతో సంచలనం సృష్టిస్తున్న బండ్ల గణేష్..!

-

ఒకప్పుడు కమెడియన్ గా చాలా సినిమాలలో నటించి ఆ తర్వాత నిర్మాతగా పవన్ కళ్యాణ్ సినిమాలను ఎక్కువగా నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన పవన్ కళ్యాణ్ అభిమానిగా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నుంచి సరైన పిలుపు రావడంలేదని ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బండ్ల గణేష్. ఇప్పుడు తాజాగా వేదాంతం మాట్లాడుతూ.. వరుస ట్వీట్ లు చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు. సాధారణంగా వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండే ఈయన ఇప్పుడు ఎందుకో గాని వేదాంత ధోరణిలో ఎవరో తనను మోసం చేశారు అన్నట్టుగా ట్వీట్లు చేస్తూ హాట్ టాపిక్ గా మారాడు.

తాజాగా బండ్ల గణేష్ వరుస ట్వీట్లు చేస్తూ సంచలనం సృష్టిస్తుండగా అవి బాగా వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. “ఎలుక రాతిదైతే పూజిస్తాం.. ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం.. పాము రాతిదైతే పాలు పోస్తాం.. ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం ..తల్లిదండ్రుల ఫోటోకి దండేసి దండం పెడతాం.. కానీ ప్రాణాలతో ఉన్నప్పుడు పట్టించుకోము.. చనిపోయిన వారికి భుజాలు అందిస్తాం.. బ్రతికున్నప్పుడు గేటు దగ్గరకు వస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వం ..

రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం.. కానీ మనుషులలో మానవత్వం ఉందని గుర్తించలేకపోతున్నాము.. జీవం లేని వాటిపై ఉన్న ప్రేమ, భక్తి ప్రాణాలతో ఉన్నప్పుడు ఎందుకు ఉండదు.. ఒకసారి ఆలోచించుకోండి..” అంటూ వరుస ట్వీట్లు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు.. మరొక ట్వీట్ ద్వారా “మనిషి వేసే ప్రతి అడుగు స్వార్థంతోనే..ప్రతి మాట స్వార్ధంతోనే.. పబ్లిసిటీ.. పబ్లిసిటీ.. దీనిని వదిలేసినప్పుడే మానవత్వం బయటకి వస్తుంది” అంటూ మరో షాకింగ్ ట్వీట్ చేశారు బండ్ల గణేష్.

Read more RELATED
Recommended to you

Latest news