బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్‌పై నెటిజన్లు ఫైర్.. సారీ చెప్పాలని డిమాండ్

-

బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్‌పై నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఆయన చేసిన పని భారతీయులను కించపరిచేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ కిలాడీ చేసిన తప్పేంటి..?

అక్షయ్‌ తన ఉత్తర అమెరికా టూర్‌ను ప్రమోట్‌ చేస్తూ ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘‘ఉత్తర అమెరికాలోని ప్రేక్షకులకు 100 శాతం వినోదాన్ని పంచేందుకు ‘ది ఎంటర్‌టైనర్స్‌’ వాళ్లు సిద్ధంగా ఉన్నారు. మీరంతా సీట్‌ బెల్టు పెట్టుకొని ఉండండి. మేము మార్చిలో మీ ముందుకు వస్తున్నాం’’ అనే క్యాప్షన్‌ను రాశారు. ఈ వీడియోలో అక్షయ్‌తో పాటు దిశా పటానీ, నోరా ఫతేహీ, మౌనీరాయ్‌ తదితరులు ఉన్నారు. వారంతా షూ వేసుకుని గ్లోబ్‌పై నడుస్తూ ఉన్న ఈ ప్రమోషనల్‌ వీడియోపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అక్షయ్‌ను ట్రోల్‌ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘భాయ్‌ ఇలా షూ వేసుకుని మనదేశ మ్యాప్‌పై నడవడానికి సిగ్గుగా అనిపించడం లేదా’ అని ఒకరు అంటే.. ‘దేశాన్ని కాస్తయినా గౌరవించండి’ అని మరొకరు అన్నారు. ‘మీరు చేసిన పనికి భారతీయులందరికీ క్షమాపణలు చెప్పండి’ అంటూ మరో నెటిజన్‌ డిమాండ్‌ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news