లోకేషుకు ఆంధ్రప్రదేశ్ అని రాయడం కూడా రాదు – కన్నబాబు

-

లోకేషుకు ఆంధ్రప్రదేశ్ అని రాయడం కూడా రాదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కన్నబాబు. సీఎం జగన్ గురించి మాట్లాడే స్థితిలో లోకేష్ ఉన్నారా..?లోకేషును లీడరుగా ప్రొజెక్ట్ చేసే క్రమంలో బూతులు నేర్పినట్టు ఉన్నారన్నారు. అయ్యన్న ఒళ్లు బలిసి గంజాయి మత్తులో మాట్లాడినట్టుగా కన్పిస్తోంది. పిచ్చాస్పత్రి ఉంది కాబట్టి రాజధానిని మారుస్తున్నారని అయ్యన్న అంటారా..? అని మండిపడ్డారు.

సీఎం జగన్ను అంత అగౌరవంగా మాట్లాడతారా..? పిచ్చాస్పత్రిలో చూపించుకోవాల్సింది చంద్రబాబేనని తెలిపారు. టీడీపీ నేతలు ఇదే విధంగా మాట్లాడితే వైసీపీ నేతలు మాట్లాడే మాటలకు తట్టుకోలేరన్నారు. కొడాలి నానిని బూతుల మంత్రి అని బ్రాండింగ్ చేస్తారా..? చంద్రబాబు, లోకేష్, అయ్యన్న మాట్లాడే మాటలు సమ్మగా ఉన్నాయా..? అని నిలదీశారు. కామెంట్లు చేయడమే కాదు.. ఈ మధ్యన లోకేష్, చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ మారిందని..జగన్ రాయలసీమలోనే పుట్టారా అని లోకేష్ అడుగుతారా..? అని ఫైర్‌ అయ్యారు. జగన్ పదో తరగతి తప్పారంటూ చంద్రబాబు కామెంట్లు చేస్తున్నారని…జగనుకు, లోకేషుకు టెన్త్ పరీక్షల్లో పోటీ పెడదామా..? అని ఛాలెంజ్‌ విసిరారు.
లోకేషుకు ఆంధ్రప్రదేశ్ అని రాయడం కూడా రాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news