మాజీ ఎమ్మెల్యే సర్రాజు కన్నుమూత..సీఎం జగన్ సంతాపం

-

వైసీపీ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, పశ్చిమగోదావరి జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన 10 గంటలకు ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆయన కుటుంబం తో పాటు వైసిపి పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా పాతపాటీ సర్రాజు కు భార్య మరియు ఇద్ద రు కుమారులు ఉన్నారు. ఆయన ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. అయితే, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని.. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news