బీసీలకు రాజ్యాధికారం అంటే చంద్రబాబు పల్లకి మోయడమేనా? – మంత్రి దాడిశెట్టి

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి దాడిశెట్టి రాజా. తుని రైలు దహనం కేసు ఘటనలో విజయవాడ రైల్వే కోర్టుకు హాజరైన మంత్రి దాడిశెట్టి రాజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మూడు నెలల తర్వాత బయటకు వచ్చి హడావిడి చేస్తున్నారని విమర్శించారు. బీసీలకు రాజ్యాధికారం అంటే చంద్రబాబు పల్లకి మోయడమేనా? అని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు కాపులు ఓటు వేయకపోతే బీసీలు బానిసలైపోతారనేలా పవన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. 2014 నుంచి పవన్ చంద్రబాబుతో కలిసే ఉన్నారని, అతను ఇచ్చే స్క్రిప్ట్ నే చదువుతారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ని బట్టి అతనికి ప్యాకేజ్ ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి దాడిశెట్టి. పవన్ కళ్యాణ్ రాజకీయం ఏంటో ఈ రాష్ట్రంలో నిక్కర్ వేసుకున్న బుడ్డోడికి కూడా తెలుసన్నారు. కాపు సేవా సమితి పేరుతో హరిరామ జోగయ్య హడావిడి చేస్తున్నారని.. అవసరమైతే మళ్లీ చంద్రబాబు సంక నాకుతాడని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news