అస్వస్థతకు గురైన టాలీవుడ్ యంగ్ హీరోయిన్

-

ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా కుర్ర కారు హృదయాలను తన వైపు తిప్పుకున్న పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే.. తాజాగా పాయల్‌ అనారోగ్యం బారీన పడింది. పాయల్ రాజ్ పుత్ కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు తెలిపింది.

కొద్ది రోజులుగా ఈ డిసీజ్ కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. ఇంట్లోనే సెలైన్ పెట్టుకున్నా ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ హెల్త్ పై అప్డేట్ అందించింది. ఈ మేరకు ఓ నోట్ కూడా రాసుకుంది. నేను చాలా తక్కువ నీరు తాగేదాన్ని. దాంతో కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది. ఫలితంగా కాస్త అనారోగ్యానికి గురయ్యాను. ప్రస్తుతం ట్రీట్మెంట్ ముగిసింది. యాంటీబయాటిక్స్ లాస్ట్ డోస్ తీసుకున్నాను. మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. రోడ్ బ్లాక్ లు ఉన్నప్పటికీ అడ్డంకులను అధిగమించాలని పేర్కొంది పాయల్.

Read more RELATED
Recommended to you

Latest news