కేతిరెడ్డి వర్సెస్ పరిటాల..కౌంటర్లకే కౌంటర్లు..!

-

ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, టి‌డి‌పి నేత పరిటాల శ్రీరామ్ మధ్య తీవ్ర స్థాయిలో రచ్చ నడుస్తోంది. తాజాగా లోకేష్ పాదయాత్ర ధర్మవరం లో జరిగింది. ఈ క్రమంలో కేతిరెడ్డి టార్గెట్ గా లోకేష్ ఫైర్ అయ్యారు.

కేతిరెడ్డి ఇసుక దందాలు చేస్తున్నారని, ఇసుక లారీల వద్ద లోకేష్ సెల్ఫీ తీసుకున్నారు. అలాగే చెరువు మధ్యలో కేతిరెడ్డి గెస్ట్ హౌస్ ని చూపిస్తూ లోకేష్ మరొక సెల్ఫీ దిగారు. ఇలా భూములు ఆక్రమించుకుని కేతిరెడ్డి గెస్ట్ హౌస్‌లు కట్టారని లోకేష్ ఆరోపించారు. దీనికి కేతిరెడ్డి కౌంటర్ ఇస్తూ..ఆ భూములు తాను రైతుల వద్ద కొనుక్కున్నానని చెప్పి..చంద్రబాబు నివాసం ఉంటున్న మంగళగిరి కరకట్ట వద్దకు వెళ్ళి..బాబు నివాసం ఉంటున్నది అక్రమ కట్టడం అని కేతిరెడ్డి ఆరోపించారు.

Dharmavaram Politics

దీనికి పరిటాల శ్రీరామ్ ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. నిజాలు బయటకు రావడంతో కేతిరెడ్డిలో టెన్షన్ మొదలైందని, దాంతో మంగళగిరికి వచ్చేసి ఏదో చేద్దామని చూశారని, అసలు బాబు ఉంటున్న ఇల్లు అద్దె ఇల్లు అని, నెల నెల అద్దె కట్టి అక్కడ ఉంటున్నారని, అలాగే అక్కడ ఇళ్లకు పర్మిషన్ ఇచ్చింది..గత వైఎస్సార్ ప్రభుత్వమని, ఇవేమీ తెలుసుకోకుండా కేతిరెడ్డి పనికిమాలిన ఆరోపణలు చేశారని పరిటాల కౌంటర్ ఇచ్చారు.

అలాగే ఇకనుంచి కేతిరెడ్డి చేసిన అక్రమాలు, భూకబ్జాలు, అవినీతి బాగోతాలు అన్నీ ప్రతి రోజు రాష్ట్రం అంతా వినిపించేలా బయటపెడతామని హెచ్చరించారు. ఇక ధర్మవరంలో 25 ఎకరాలను కొనుగోలు చేసి 40 ఎకరాలను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఎన్‌వోసీలు ఇవ్వకపోవడంతో కలెక్టర్‌ను దూషించారని అన్నారు. మొత్తానికి పరిటాల, కేతిరెడ్డిల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news