బండి సంజయ్ కోర్టులో పచ్చి అబద్ధాలు చెప్పారు – ఎమ్మెల్సీ పల్లా

-

నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టులో జరిగిన పరిణామాలను తెలుసుకోవాలని హైకోర్టు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లని కోరారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. బిజెపి అడ్వకేట్ లు నిన్న న్యాయవ్యవస్థ పై దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బండి సంజయ్ కోర్టులో పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు పల్లా.

 

బిజెపి లాయర్లు వద్దని చెప్పినా కోర్టులో బండి సంజయ్ అబద్దాలు చెప్పారని ఆరోపించారు. బండి సంజయ్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఫోన్ తో ఏం పని అంటూ పోలీసులను బెదిరిస్తున్నాడని.. వాళ్ల లాయర్లు కూడా అదే రకంగా మాట్లాడుతున్నారని అన్నారు. బండి సంజయ్ పేపర్ లీకేజీ కుట్రలో ఏ – 1 అని ఆరోపించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. అవసరమైనప్పుడల్లా జడ్జిలను బిజెపి శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news