బీజేపీలోకి తులసీ సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త నాయకుల చేరికలపై బీజేపీ పార్టీ ఫోకస్ చేసింది. ఇప్పటికే నల్లారి కిరణ్‌ కుమార్‌ బీజేపీ తీర్థం పుచ్చుకోగా, తాజాగా బీజేపీలో చేరనున్నారు తులసీ రామచంద్ర ప్రభు. ఇవాళ సాయంత్రం రాజమండ్రిలో కేంద్ర మంత్రి మురళీధరన్, సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ జీ, సోము వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరనున్నారు రామచంద్ర ప్రభు.

తులసీ సీడ్స్ అధినేతనే రామచంద్ర ప్రభు. 2009 లో ప్రజారాజ్యం తరపున పీఆర్పీ నుంచి తులసీ రామచంద్ర ప్రభు పోటీ చేశారు. ఇక త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని చెబుతున్నాయి బీజేపీ వర్గాలు. అటు మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు త్వరలో పార్టీలో చేరనున్నట్టు సమాచారం. ఇక బీజేపీలో ఎవరు చేరుతారో.. ఎవరు బయటకు వెళతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news