జగన్‌ బెదిరించాడు..అందుకే ఆదిమూలపు ఇలా చేస్తున్నాడు – నక్కా ఆనందబాబు

-

ఎర్రగొండ పాలెం ఘటనపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు సంచలన కామెంట్లు చేశారు. జగన్‌ బెదిరించాడు..అందుకే ఆదిమూలపు ఇలా చేస్తున్నాడన్నారు నక్కా ఆనందబాబు. మంత్రి సురేషును ప్రభుత్వం బ్లాక్ మెయుల్ చేసిందంటూ నక్కా ఆరోపణలు చేశారు. ఆదిమూలపు సురేష్ నిన్న తన సహజత్వానికి భిన్నంగా వ్యవహరించారని..సురేషుకున్న లోపాలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వమే నాటకం ఆడించిందని మండిపడ్డారు.

సురేష్ ను లొంగదీసుకుని గుప్పెట్లో పెట్టుకున్నారు… మంత్రి ఆదిమూలపు సురేషును ప్రభుత్వ పెద్దలు బ్లాక్ మెయిల్ చేశారన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని సురేష్ ఉన్నమాటే అన్నారు… వివేకా విషయంలో సురేష్ కామెంట్లపై జగన్.. సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు దీంతో సురేష్ భయపడి.. ఈ రకంగా వ్యవహరించారు… సురేష్ స్వభావం చాలా కాలంగా తెలుసు..అలాంటి మనిషి కాదన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు.

Read more RELATED
Recommended to you

Latest news