నేడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..హాజరుకానున్న రజినీ, బాలయ్య, చంద్రబాబు

-

నేడు విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. నెల రోజుల పాటు 100 ప్రాంతాల్లో 100 వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్రణాళిక చేసింది తెలుగు దేశం పార్టీ. ఈ తరుణంలోనే, ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై ఇవాళ రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు.

పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్, బాలయ్య, చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఎన్టీఆర్ పై తొలి పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్టు ఎస్. వెంకటనారాయణ. ఎన్టీఆర్ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు తెలియచేసే లక్ష్యంతో టీడీ జనార్థన్ నేతృత్వంతో సావనీర్ కమిటీ ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news