SSC రిజల్ట్స్ పై అధికారిక ప్రకటన… సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దు !

-

ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసిపోయి, ఇప్పుడు విద్యార్థులు అంతా ఫలితాల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇంకా ఫలితాలు ఎప్పుడన్న విషయం టెన్త్ బోర్డ్ ప్రకటించకపోయినా… సోషల్ మీడియాలో ఈ రోజు రేపు అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మే 5 లేదా మే 7 వ తేదీన ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో SSC బోర్డ్ అధికారిక ప్రకటన చేసింది. SSC ఫలితాలు విడుదల చేసే తేదీని ప్రభుత్వమే ప్రకటిస్తుందని… అప్పటి వరకు విద్యార్థులు వేచి చూడాలని తెలిపింది.

కాగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని వారికి సూచించింది. దీనితో SSC ఫలితాల కోసం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలో అంటూ విద్యార్దులు సంయమనంతో పడిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news