వైసీపీలోకి అంబటి రాయుడు.. సీఎం జగన్ తో భేటీ

-

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరబోతున్నాడు అంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాను రాజకీయాలలోకి రావాలనుకుంటున్నట్లు రాయుడు ఇంతకుముందే ప్రకటించాడు. ఇక ఇటీవల సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా వైసిపి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

దీనికి అంబటి రాయుడు రీ ట్వీట్ చేశాడు. “మన ముఖ్యమంత్రి జగన్ గారి గొప్ప ప్రసంగం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మీ మీద నమ్మకం, విశ్వాసం ఉన్నాయి సార్” అని కామెంట్ చేశాడు. దీంతో రాయుడు వైసీపీలో చేరుతున్నాడు అనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా వాటిని నిజం చేసేలా ఆయన ఏపీలోనే సీఎం క్యాంపు కార్యాలయంలో దర్శనమిచ్చారు. దీంతో రాయుడు వైసీపీలో చేరబోతున్నాడని మరోసారి జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అంబటి రాయుడు ఎందుకు అక్కడికి వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news