రవితేజ కోసం ఏకంగా 5 మంది స్టార్ హీరోలు.. కథ ఏంటో..!

-

మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గెలుపు ఓటమితో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈయన ఇంకా 2023 మధ్యలోకి కూడా రాకముందే రెండు సినిమాలతో సందడి చేశారు. ఇకపోతే ఒకటి మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ గా నిలవగా.. ఇక తాను సోలో హీరోగా నటించి ఎన్నో అంచనాల మధ్య విడుదల చేసిన రావణాసుర సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో నెక్స్ట్ సినిమాతో ఆయన బాగా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.

ఇకపోతే మొదటిసారి రవితేజ పాన్ ఇండియా సినిమాను టచ్ చేయబోతున్నాడు. టైగర్ నాగేశ్వరరావు ప్రాజెక్టుతో బిజీగా ఉన్న ఈయన స్టువర్ట్పురం గజదొంగ నాగేశ్వరరావు లైఫ్ జర్నీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించగా ప్రమోషన్స్ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ప్లాన్ చేస్తున్నారు.

ఇకపోతే సినిమాపై ఇప్పటి నుంచే హైప్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మేకర్స్ పక్కా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మే 24వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.. ఇకపోతే పాన్ ఇండియా సినిమా కాబట్టి రవితేజ పాత్రను పరిచయం చేయడానికి ప్రతి భాష నుంచి కూడా ఒక స్టార్ రంగంలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హీరో పాత్రను పరిచయం చేయడానికి కన్నడలో శివరాజ్ కుమార్, మలయాళం లో దుల్కర్ సల్మాన్ తమ వాయిస్లను అందిస్తున్నారు. మరొకవైపు హిందీలో సల్మాన్ ఖాన్ వాయిస్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక త్వరలోనే తెలుగు, తమిళ్లో ఏ హీరోలు వాయిస్ ఓవర్ ఇస్తున్నారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news