IPL 2023 : నేడు ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్..ఇవాళ కూడా వర్షం గండం !

-

IPL 2023 : సీఎస్కే, జీటీల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. అయితే ఐపీఎల్ చరిత్రలో ఒక ఫైనల్ మ్యాచ్ వాయిదా పడడం ఇదే తొలిసారి. గత 15 సీజన్లలో ఏ ఫైనల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారలేదు. దీంతో రిజర్వ్ డేకు మ్యాచ్ వాయిదా పడలేదు.

అయితే గత సీజన్లలో వర్షం కారణంగా ఇతర మ్యాచ్లు రద్దు చేయడం లేదా ఓవర్లు కుదించి ఆటను కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి. కాగా నిన్న జరగాల్సిన ఫైనల్‌ మ్యాచ్‌ ఇవాళ జరుగుతుందని అంపైర్లు ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఈ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఇక నిన్నటి టికెట్లు ఈ మ్యాచ్‌ కు కూడా పనిచేస్తాయని స్టేడియం అధికారులు వెల్లడించారు. అయితే.. ఇవాళ కూడా మ్యాచ్‌ కు వర్షం గుండం ఉండటం ఆందోళనకరమైన అంశం.

Read more RELATED
Recommended to you

Latest news