హారీష్‌ ను విమర్శిస్తే..ఈటలను తిట్టినట్లు వార్తలు రాస్తున్నారు – విజయశాంతి

-

మీడియాపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది బీజేపీ పార్టీ నేత విజయశాంతి. తెలంగాణ మంత్రి హారీష్‌ రావును విమర్శిస్తే..ఈటలను తిట్టినట్లు వార్తలు రాస్తున్నారని విజయ శాంతి తన ఆవేదన ను వ్యక్తం చేసింది.

నేను చేరికల కమిటీ పై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు చేసిన కామెంట్స్ ను విమర్శించి పోస్ట్ పెడితే, ఆ అంశాన్ని బీజేపీ అంతర్గత గొడవలు అన్నంత ప్రచారానికి, రాములమ్మకు ఈటల గారికి ఘర్షణ అనేంత వార్తలకు మీడియాలోని కొందరు ప్రయత్నిస్తుండడం ఆసమంజసం, అనవసరం, అవివేక ప్రయత్నం కూడా… అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో బీజేపీ లోని విభేదాలు యాడ ఉన్నాయో వారికే తెలియాలి, కనీసం స్పష్టంగా తెలియజేసే ధైర్యముండాలంటూ చురకలు అంటించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news