పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతో..ఈ హత్య – పోలీసులు

-

పెళ్లి చేసుకోవాలని..పూజారి సాయికృష్ణను అప్సర ఒత్తిడి చేయడంతో..ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తనను ఒత్తిడి చేయడంతో చంపేశానని సాయికృష్ణ చెప్పినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అప్సరా అనే అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు పూజారి సాయి కృష్ణ. హత్య తరువాత మృతదేహాన్ని సరూర్ నగర్ వద్దకు తీసుకొని మురికి కాలువలో పడేసి మట్టితో పూడ్చిపెట్టాడు పూజారి సాయి.

హత్య చేసిన వెంకట సాయికృష్ణకు ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళను కారులో ఎక్కించుకొని వచ్చి శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోది హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కవర్లో కట్టి కారులో తీసుకెళ్లి సరూర్నగర్ లోనే మ్యాన్ హోల్లో పడేశాడు సాయికృష్ణ. ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని ఆర్జిఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు బయటపెట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news