చంద్రబాబుతో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం భేటీ.. టిడిపిలో చేరిక ఖాయం !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఏడాది లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. వైసీపీ నుంచి కొంత మంది టీడీపీకి వెళ్తే… మరికొంతమంది లీడర్లు వైసీపీని వీడుతున్నారు. అయితే తాజాగా వైసిపి నుంచి సస్పెండ్ అయిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి… హైదరాబాద్ లో నిన్న నారా చంద్రబాబు నాయుడుతో కీలక సమావేశం అయ్యారు.

సుమారు గంటన్నర పాటు నెల్లూరు జిల్లా రాజకీయాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం వైయస్సార్ జిల్లాలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర గురించి కూడా వివరాలు తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి… టిడిపిలో చేరడం పై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం అందుతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం మరో వారం రోజుల్లో… టిడిపి కండువా కప్పుకునేందుకు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news