కోమటిరెడ్డి ఇంటికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఇంటికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరికలపై కోమటిరెడ్డితో రేవంత్ రెడ్డి మంతనాలు జరిపారు. ఆ తర్వాత జూపల్లి ఇంటికి వెళ్లనున్నారు రేవంత్, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… కోమటిరెడ్డి, నేను కలిసి పనిచేస్తామని ప్రకటించారు.

చేరికలపై ఎలాంటి విభేదాలు లేవు.. కోమటిరెడ్డి, ఉత్తమ్, జానారెడ్డిని సంప్రదించకుండా చేరికలు ఏవీ జరగడం లేదని వివరించారు రేవంత్‌ రెడ్డి. ఆ ముగ్గురితో చర్చించాకే పార్టీలో చేర్చుకుంటాం.. చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరుతామంటున్నారన్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డితో రోజూ మాట్లాడుతుంటాను.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.. అధికారంలోకి వచ్చాక కూడా కలిసే ఉంటామని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news