2024 ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తాం..

-

దేశంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రెండు పర్యాయాలుగా వరుసగా అధికారంలో కొనసాగుతున్న ఈ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ వ్యతిరేకతను సరిగా వినియోగించుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే విపక్ష పార్టీలు అన్నిటినీ ఒక తాటిపైకి తీసుకువస్తున్నారు. 2024 లో జరగనున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తున్నారు. ఇక తాజాగా విపక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ అన్ని పార్టీలు కలిసి కట్టుగా ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీని ఓడించి కాంగ్రెస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకువస్తాం అన్నారు.

అందుకు అనుగుణంగా సరైన అజెండాను రూపకల్పన చేస్తున్నాం అన్నారు. ఈ సమావేశం లాగానే వచ్చే నెలలో రెండవ వారంలో కీలక సమావేశం ఉండనుంది అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news