ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ అభినందనలు

-

ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. వారాహి విజయ యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు చెప్పిన పవన్.. పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 14న ప్రారంభమైన వారాహి విజయ యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దిగ్విజయంగా సాగిందని చెప్పారు.

నేటి మలికిపురం సభతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక దశను ముగించి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించామని… ఇప్పటి వరకు ఈ యాత్రను విజయవంతం చేయడంలో పాలుపంచుకున్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, జిల్లాకు చెందిన పిఏసీ సభ్యులు, నియోజక వర్గాల ఇంచార్జులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, వీర మహిళలు, జన సైనికులకు నా హృదయపూర్వక అభినందనలు అన్నారు పవన్.

యాత్ర సాఫీగా సాగడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లిన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్, కమిటీ సభ్యులకి, యాత్ర కోసం ఏర్పాటైన వివిధ కమిటీల సభ్యులకి ప్రత్యేక అభినందనలు చెప్పారు. వారాహి విజయ యాత్రకి సహకరించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని వెల్లడించారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news