ఇది రాష్ట్రమా ? రావణకాష్టమా ?: చంద్రబాబు

-

మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికార పార్టీ వైసీపీ పై మరియు సీఎం జగన్ పై సంచలన కామెంట్ లు చేశాడు. ఈయన మాట్లాడుతూ… పదవ తరగతి విద్యార్థి సజీవ దహనం అయితే సీఎం జగన్ ఏమి పరిష్కారం చూపాడు ? ఏలూరులో జరిగిన యాసిడ్ దాడి పై సీఎం జగన్ ఒక్క మాటా మాట్లాడలేదు ? ఇన్ని జరుగుతున్నా శాన్తభద్రతల గురించి కనీసం మీటింగ్ అయిన పెట్టుకోలేదంటూ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతి బహిరంగ సభలో నేను ప్రజల బిడ్డను అని చెప్పుకునే జగన్… దాడులు చేస్తున్న సొంత పార్టీ నేతలను శిక్షించకుండా ఎందుకు కాపాడుతున్నాడంటూ రెచ్చిపోయి మాట్లాడారు చంద్రబాబు నాయుడు.

జగన్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలా లేదు రావణకాష్టంలా ఉందంటూ మండిపడ్డారు. ఈ ఆవేశ పూరిత కామెంట్ లపై వైసీపీ నుండి ఎవరైనా స్పందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news