తెలంగాణలో కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయా ?

-

తెలంగాణాలో ఒక వారం రోజుల నుండి రాజకీయాలలో ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో రెండు కీలక విషయాలు… అధికార పార్టీ నుండి బయటకు వచ్చేసిన పొంగులేటి మరియు జూపల్లి లు ఈ రోజు ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు, మరికాసేపట్లో కాంగ్రెస్ లో అధికారికంగా చేరినట్లు వార్త వస్తుంది. ఇక రెండవ విషయం… తెరాస నుండి వచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ మరియు కాంగ్రెస్ నుండి విభేసలతో బీజేపీ గూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు అంతర్గత కుమ్ములాటల్లో నెగ్గలేక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ కాంగ్రెస్ లో చేరడానికి సుముఖంగా ఉన్నారట.

ఇది జరిగితే.. కాంగ్రెస్ కు శుభసూచకం అని చెప్పాలి, తెలంగాణాలో కాంగ్రెస్ వీరందరి చేరికతో బాగా పుంజుకుంటుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news