రేపు కురుపాంలో సీఎం జగన్‌ పర్యటన..అమ్మ ఒడి నిధులు విడుదల

-

 

రేపు సీఎం వైఎస్‌ జగన్‌ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేయనున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. ఇందులో భాగంగానే రేపు ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి జగన్‌.

రేపు ఉదయం 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్‌ కళాశాల హెలీప్యాడ్‌కు చేరుకోనున్న సీఎం జగన్… కురుపాం బహిరంగ సభ వద్దకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్. అనంతరం.. తాడేపల్లి గూడెంకు తిరుగు ప్రయాణం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news